లారీ ఢీకొని వృద్ధుడు మృతి
లారీ ఢీకొని వృద్ధుడు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని తుమ్మలగూడెం గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన చిన్నలచ్చి సాయిలు (69) తన టీవీఎస్ ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా, చిట్యాల వైపు నుండి భువనగిరి వైపు వెళ్తున్న లారీ (HR 38 W 9712) వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిలును స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య చిన్నలచ్చి నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామన్నపేట ఎస్సై జి . సతీష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు..