BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

​మంచిర్యాల జిల్లాలో హెచ్.ఐ.వి స్క్రీనింగ్ పటిష్టం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jul, 2026 - 07:49 PM
73 వీక్షణలు

​మంచిర్యాల జిల్లాలో హెచ్.ఐ.వి స్క్రీనింగ్ పటిష్టం: అంతర్జాతీయ '95-95-99' లక్ష్యాల సాధనే ధ్యేయం

​జిల్లాలో 2,064 మందికి ఉచిత ఏఆర్టీ చికిత్స: సమీక్షా సమావేశంలో డి.ఎమ్.హెచ్.ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్

​మంచిర్యాల, జూలై 16: మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం (ఐ.డి.ఓ.సి) లో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డి.ఎమ్.హెచ్.ఓ) డాక్టర్ నరేందర్ రాథోడ్ గారి అధ్యక్షతన 'దిశా' (DISHA) మాస నివేదిక సమీక్షా సమావేశం నిర్వహించబడింది. మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష (MAS) లక్ష్యాలను సమీక్షించడం, హెచ్.ఐ.వి బాధితులకు (PLHIV) మెరుగైన వైద్య సేవలను అందించడమే ధ్యేయంగా ఈ సమావేశం సాగింది. ప్రస్తుతం జిల్లాలో 2,064 మంది హెచ్.ఐ.వి బాధితులకు ఉచిత యాంటీ-రెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స అందిస్తున్నామని, ఇందులో 98 శాతం మంది రోగులకు వైరల్ లోడ్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు డి.ఎమ్.హెచ్.ఓ వెల్లడించారు.

​అంతర్జాతీయ "మొదటి 95" లక్ష్యాన్ని చేరుకోవడానికి, జిల్లాలో ఇంకా నిర్ధారణ కాని మరో 436 కొత్త హెచ్.ఐ.వి కేసులను గుర్తించాల్సిన అవసరం ఉందని డాక్టర్ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది, వైద్య బృందాలు సమన్వయంతో పనిచేస్తూ, గ్రామీణ మరియు సమస్యాత్మక ప్రాంతాలలో విస్తృతంగా ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. వ్యాధిని ముందుగా గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని, ప్రజలు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకుని, పాజిటివ్ అని తేలితే వెంటనే ఉచిత ఏఆర్టీ చికిత్స పొంది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆయన పిలుపునిచ్చారు.

​జిల్లాలో హెచ్.ఐ.వి మరియు సిఫిలిస్ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయబడునని అధికారులు తెలిపారు. ప్రజలు మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) లోని ఐ.సి.టి.సి రూమ్ నంబర్ 50, డి.ఎస్.ఆర్.సి రూమ్ నంబర్ 48 లేదా లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని రూమ్ నంబర్ 5 లో ఈ ఉచిత సేవలను వినియోగించుకోవచ్చని, మరిన్ని వివరాలకు 1098 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు. ఈ సమావేశంలో ఎయిడ్స్ & లెప్రసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, దిశా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఎ. నీలిమ, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, సి.ఎస్.ఓ ఆర్. రాజేష్, ఐ.సి.టి.సి కౌన్సిలర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు మరియు ఎన్.జి.ఓ ప్రతినిధులు పాల్గొన్నారు