BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

చాట్రాయి మండల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.3.50 లక్షల విలువైన నోటుబుక్స్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jul, 2026 - 08:24 PM
48 వీక్షణలు

చాట్రాయి మండల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.3.50 లక్షల విలువైన నోటుబుక్స్ పంపిణీ

రేపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాట్రాయిలో కార్యక్రమం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 1,269 మంది విద్యార్థులకు సుమారు రూ.3.50 లక్షల విలువైన 6,346 నోటుబుక్స్ పంపిణీ చేయనున్నారు.

గత నెల 20వ తేదీన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సి.గుడిపాడులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో చాట్రాయి ఎంఈవో-2 వి.ఎస్.వి. బ్రహ్మాచారి చేసిన విజ్ఞప్తికి స్పందించిన రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ గవర్నర్ పంగులూరి కళ్యాణ్ మరియు బిజిర్ మైన్స్ డైరెక్టర్ బాలకోటిరెడ్డి ఈ నోటుబుక్స్‌ను అందించేందుకు ముందుకొచ్చారు. వారి ఆమోదంతో నోటుబుక్స్ ఇప్పటికే ఎంఆర్సీ చాట్రాయికి చేరుకున్నాయి.

ఈ నోటుబుక్స్ పంపిణీ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చాట్రాయిలో నిర్వహించనున్నట్లు ఎంఈవో-2 వి.ఎస్.వి. బ్రహ్మాచారి తెలిపారు. ఈ కార్యక్రమానికి పాత్రికేయులు హాజరై విజయవంతం చేయాలని ఆయన ఆహ్వానించారు.

కాగా, ఇదే దాతలు గతంలో కూడా బ్రహ్మాచారి విజ్ఞప్తి మేరకు చాట్రాయి ఎంఆర్సీకి సౌండ్ సిస్టమ్‌ను బహుమతిగా అందించి విద్యారంగానికి తమ వంతు సహకారం అందించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా వేలాది మంది చిన్నారులకు అవసరమైన నోటుబుక్స్ అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూతనందిస్తున్నారు.