చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్
చింతలపూడి పట్టణంలోని గంటావారి వీధి, ఎరుకలపేటలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన వర్గాల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఎన్టీఆర్ భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి నెలా పెన్షన్లను లబ్ధిదారుల గడప వద్దకే అందిస్తూ వారి జీవితాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. "పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం" అనే సందేశంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.