BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 16 July 2026, 09:09 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నకిలీ నారతో నష్టపోయిన రైతు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 Jul, 2026 - 09:09 AM
96 వీక్షణలు

నకిలీ నారతో నష్టపోయిన రైతు -ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు..

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం,

చౌడేపల్లి

మండలంలోని కాగతి గ్రామపంచాయతీ, యనమసామనపల్లి కి చెందిన రైతు ఏడూరు గంగరాజు తన ఐదు ఎకరాల పొలంలో టమాట జయహో టమాట నారును తమ ప్రక్క గ్రామమైన యల్లంపల్లి నందుగల నరసింహారెడ్డి నర్సరీ నందు ఒకలాట్ మొత్తం ముప్పై ఐదువేల జయహో టమాటా నారు కొనుగోలు చేసి నాటారు. 

ఐతే అతను గత ఇరవై సంవత్సరాలనుండి వ్యవసాయం చేస్తున్ననూ ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని, ఐతే ఈ ఏడు యల్లంపల్లి నరసింహ రెడ్డి నర్సరీ నందు  విత్తనాలు నఏను తీసిస్తానని చెప్పినా వినకుండా ఆయనే సొంతంగా విత్తనాలు కొనుగోలు చేసి నారు ఇచ్చాడని, ఐతే వీటికి 35 లోడ్లు పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు తోలడం జరిగిందని, నీళ్ళు పుష్కలంగా ఉన్నాయని ఆయన వాపోయారు.

 ఇప్పటి వరకు సుమారు పన్నెండులక్షలు ఖర్చులు పెట్టానని, ప్రస్తుతం కాయలు అన్ సైజ్ వచ్చాయని గోళీలు కావడంతో వాటిని పారబోయడానికి తప్ప ఇంకేమిటికి  పనికి రావని, ఇంత పెట్టుబడి పెట్టి లాభం లేదని రైతు గంగరాజు వాపోయాడు. 

 కళావతమ్మ మాట్లాడుతూ గత రెండీ మూడు రోజుల నుండి నా భర్త చాలా వరకు డిప్రెషన్ లో ఉన్నారని ప్రతి రోజు ఆరువందల బాక్సులు అవుతున్నాయి.

నలబై మంది కూలీలు అవసరం ఉందని నా భర్త ఎప్పుడు ఎటువంటి అఘాత్యాలకి పాల్పడుతాడోనని అనునిత్యం కాపలా గా ఉన్నామని, అధికారులు నకిలీ నారు ఇచ్చిన నరసింహారెడ్డి పైన చట్ట రిత్యా చర్యలు తీసుకొని, మాకు న్యాయం చేయాలని అన్నారు.