BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

​మెరుగైన వైద్య సేవలు అందించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:33 PM
7 వీక్షణలు

​మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. బెల్లంపల్లి మండల కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేలా అవగాహన కల్పించడంతో పాటు, వైద్య సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.

​అనంతరం విద్య, రెవెన్యూ రంగాల పురోగతిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించి, నాణ్యమైన సదుపాయాలతో పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కృష్ణతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్, ఈ నెల 24వ తేదీ లోగా ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. అలాగే సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి భూభారతి, రెవెన్యూ దరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించారు.

​చివరగా కాసిపేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) సందర్శించి, అక్కడ నిర్మాణంలో ఉన్న అదనపు గదులు, భోజనశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పాఠశాల వంటశాలను తనిఖీ చేసి, విద్యార్థినులకు అందించే మధ్యాహ్న భోజన నిత్యావసరాల నాణ్యతను పరిశీలించిన ఆయన, ఆహార తయారీలో శుభ్రత, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, సబ్ కలెక్టర్ మనోజ్, తహసిల్దార్ కృష్ణతో పాటు సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఆసుపత్రి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు