BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

​మెరుగైన వైద్య సేవలు అందించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:33 PM
243 వీక్షణలు

​మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. బెల్లంపల్లి మండల కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేలా అవగాహన కల్పించడంతో పాటు, వైద్య సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.

​అనంతరం విద్య, రెవెన్యూ రంగాల పురోగతిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించి, నాణ్యమైన సదుపాయాలతో పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కృష్ణతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్, ఈ నెల 24వ తేదీ లోగా ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. అలాగే సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి భూభారతి, రెవెన్యూ దరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించారు.

​చివరగా కాసిపేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) సందర్శించి, అక్కడ నిర్మాణంలో ఉన్న అదనపు గదులు, భోజనశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పాఠశాల వంటశాలను తనిఖీ చేసి, విద్యార్థినులకు అందించే మధ్యాహ్న భోజన నిత్యావసరాల నాణ్యతను పరిశీలించిన ఆయన, ఆహార తయారీలో శుభ్రత, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, సబ్ కలెక్టర్ మనోజ్, తహసిల్దార్ కృష్ణతో పాటు సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఆసుపత్రి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు