BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 15 July 2026, 10:33 pm
Posted by : V శ్రీనివాస్

​భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:33 PM
257 వీక్షణలు

​భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు

మంచిర్యాల, జూలై 15: ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు. బుధవారం భీమారం మండలం మద్దికల్ గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను ఆయన స్థానిక తహసిల్దార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్దికల్ గ్రామంలోని 853 సర్వే నంబర్లలో గల 4,810 ఎకరాల భూమిని ప్రజాప్రతినిధులు, రైతుల సమక్షంలో నలుగురు సర్వేయర్ల ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నట్లు తెలిపారు. రైతుల సహకారంతో నిబంధనల ప్రకారం సర్వే పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తవని, స్పష్టమైన వివరాలతో నూతన నక్షా రూపొందుతుందని ఆయన పేర్కొన్నారు.

​అనంతరం ఆరెపల్లి గ్రామం, భీమారం మండల పరిషత్ కార్యాలయాలను సందర్శించిన అదనపు కలెక్టర్, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమ పురోగతిని సమీక్షించారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత అంకుశాపూర్ గ్రామంలోని సమతా అగ్రో ఇండస్ట్రీస్‌ను పరిశీలించి, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి అందించాల్సిన సి.ఎం.ఆర్. (CMR) బియ్యాన్ని గడువులోగా సరఫరా చేయాలని రైస్ మిల్లు నిర్వాహకులకు సూచించారు. ఈ పర్యటనలో తహసిల్దార్‌తో పాటు పలువురు రెవెన్యూ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు