ఓటర్ల సవరణ ప్రక్రియను 100% విజయవంతం చేయాలి
ఓటర్ల సవరణ ప్రక్రియను 100% విజయవంతం చేయాలి: మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) కార్యక్రమ పురోగతిపై మేయర్ శ్రీ దర్ని మధుకర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. టీపీసీసీ (TPCC) సభ్యులు శ్రీ నూకల రమేష్తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి, పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఓటర్ల సవరణ గడువు సమీపిస్తున్నందున బూత్ స్థాయి అధికారులు (BLOలు), ఎన్యూమరేటర్లు మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, 100 శాతం ఓటర్ల సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
సవరణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్, టీపీసీసీ సభ్యులతో పాటు స్థానిక కార్పొరేటర్లు, బూత్ స్థాయి ఏజెంట్లు (BLAలు), కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు