BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

రమణమూర్తిపై చెప్పుతో దాడి పిరికిపంద చర్య

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jul, 2026 - 09:09 AM
6 వీక్షణలు

రమణమూర్తిపై చెప్పుతో దాడి పిరికిపంద చర్య – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్

రమణమూర్తిపై చెప్పుతో దాడి చేయడం ముమ్మాటికీ పిరికిపంద చర్య అని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు తీవ్రంగా ఖండించారు. విమర్శలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే బదులు భౌతిక దాడులకు పాల్పడటం మతోన్మాద, ఫాసిస్టు ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు.

విమర్శను తట్టుకోలేని శక్తులను బహిరంగ చర్చలకు, డిబేట్లకు ఆహ్వానించడం సరైన విధానం కాదని, ఇటువంటి దాడులు భావప్రకటన స్వేచ్ఛను దెబ్బతీసే ప్రమాదకర చర్యలని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందని, దానిని హింసతో అణచివేయాలని ప్రయత్నించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

రమణమూర్తిపై చెప్పుతో దాడి చేసిన ధర్మవీర్ కౌశ్యప్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తన చర్యకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.