రమణమూర్తిపై చెప్పుతో దాడి పిరికిపంద చర్య
రమణమూర్తిపై చెప్పుతో దాడి పిరికిపంద చర్య – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్
రమణమూర్తిపై చెప్పుతో దాడి చేయడం ముమ్మాటికీ పిరికిపంద చర్య అని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు తీవ్రంగా ఖండించారు. విమర్శలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే బదులు భౌతిక దాడులకు పాల్పడటం మతోన్మాద, ఫాసిస్టు ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు.
విమర్శను తట్టుకోలేని శక్తులను బహిరంగ చర్చలకు, డిబేట్లకు ఆహ్వానించడం సరైన విధానం కాదని, ఇటువంటి దాడులు భావప్రకటన స్వేచ్ఛను దెబ్బతీసే ప్రమాదకర చర్యలని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందని, దానిని హింసతో అణచివేయాలని ప్రయత్నించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
రమణమూర్తిపై చెప్పుతో దాడి చేసిన ధర్మవీర్ కౌశ్యప్ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తన చర్యకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.