చాట్రాయిలో సర్ధార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం మండల కేంద్రమైన చాట్రాయిలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో సర్ధార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కందుల కృష్ణ, పానుగళ్ళ కోటేశ్వరరావు, పలగాని దుర్గారావు, పానుగంటి కేశవరావు, చిలుకుబత్తుల సత్యనారాయణ, మరీదు శ్రీనివాసరావు, బయగాని మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్ధార్ గౌతు లచ్చన్న బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేత అని కొనియాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాలు చిరస్మరణీయమని తెలిపారు. గౌడ్ సామాజిక వర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.