BREAKING
ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రంలో జనసేన మరియు టీడీపీ,ఐటీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు పంపిణీ .. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రంలో జనసేన మరియు టీడీపీ,ఐటీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు పంపిణీ .. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
www.ntodaynews.com

చింతలపూడికి పాకిన పెట్రోల్ కొరత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:21 PM
68 వీక్షణలు

చింతలపూడికి పాకిన పెట్రోల్ కొరత

చింతలపూడి పట్టణంలో పెట్రోల్ కొరత తీవ్రంగా మారింది. పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు పూర్తిగా ఖాళీ కావడంతో, అందుబాటులో ఉన్న కొద్దిమంది బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ఉదయం నుంచే కిలోమీటర్ల మేర క్యూలలో నిల్చున్న వాహనాలు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు దారితీస్తున్నాయి.

ఇప్పటికే ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్–ఇశ్రాయేల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాపై పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రస్తావించిన నేపథ్యంలో, చింతలపూడిలో కనిపిస్తున్న పరిస్థితులు ప్రజల్లో మరింత కలవరాన్ని రేపుతున్నాయి.

ఇంధన కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని అవసరమైన మేరకు ఇంధనం నింపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి రావడానికి సరఫరా వ్యవస్థను త్వరితగతిన పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.