BREAKING
మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం
Date of Publish : 25 March 2026, 09:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడికి పాకిన పెట్రోల్ కొరత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:21 PM
139 వీక్షణలు

చింతలపూడికి పాకిన పెట్రోల్ కొరత

చింతలపూడి పట్టణంలో పెట్రోల్ కొరత తీవ్రంగా మారింది. పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు పూర్తిగా ఖాళీ కావడంతో, అందుబాటులో ఉన్న కొద్దిమంది బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ఉదయం నుంచే కిలోమీటర్ల మేర క్యూలలో నిల్చున్న వాహనాలు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు దారితీస్తున్నాయి.

ఇప్పటికే ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్–ఇశ్రాయేల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాపై పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రస్తావించిన నేపథ్యంలో, చింతలపూడిలో కనిపిస్తున్న పరిస్థితులు ప్రజల్లో మరింత కలవరాన్ని రేపుతున్నాయి.

ఇంధన కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని అవసరమైన మేరకు ఇంధనం నింపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి రావడానికి సరఫరా వ్యవస్థను త్వరితగతిన పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.