BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 01 June 2026, 04:46 pm
Posted by : V శ్రీనివాస్

ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
01 Jun, 2026 - 04:46 PM
182 వీక్షణలు

ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం

  • మైనార్టీ విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ
  • జూన్ 1 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న మైనార్టీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం (ఫాల్ సెషన్–2026) కింద అర్హులైన మైనార్టీ విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి (ఇన్‌చార్జ్) నీరటి రాజేశ్వరి తెలిపారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్ తదితర దేశాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో పీజీ లేదా పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు జూన్ 1 నుంచి జూన్ 30, 2026 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించరాదని, అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన హార్డ్ కాపీలను జూలై 31, 2026 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. అర్హులైన మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని అధికారులు పేర్కొన్నారు