BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
01 Jun, 2026 - 04:46 PM
108 వీక్షణలు

ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం

  • మైనార్టీ విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ
  • జూన్ 1 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న మైనార్టీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం (ఫాల్ సెషన్–2026) కింద అర్హులైన మైనార్టీ విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి (ఇన్‌చార్జ్) నీరటి రాజేశ్వరి తెలిపారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్ తదితర దేశాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో పీజీ లేదా పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు జూన్ 1 నుంచి జూన్ 30, 2026 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించరాదని, అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన హార్డ్ కాపీలను జూలై 31, 2026 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. అర్హులైన మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని అధికారులు పేర్కొన్నారు