ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్
ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్
ఆషాఢ ఏకాదశి సందర్భంగా మహారాష్ట్రలోని పండరీపురం విఠోబా ఆలయానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మూడు జతల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. జులై 24, 25 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
నాగర్సోల్–పండరీపురం–జల్నా, ఆదిలాబాద్–మీరజ్, అకోలా–పండరీపురం మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. భక్తుల సౌకర్యార్థం ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను ఏర్పాటు చేశారు.
ప్రయాణికులు రైళ్ల సమయాలు, మధ్యలో ఉండే స్టాప్లు, రిజర్వేషన్ వివరాలను ముందుగానే పరిశీలించి తమ ప్రయాణాన్ని ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పండరీపురం చేరుకునే అవకాశం ఉండటంతో ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.