BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

ముంబయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:52 PM
76 వీక్షణలు

ముంబయి, జూలై 15: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ముంబయిలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ కోలుకున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతి ఇచ్చారు.

డిశ్చార్జ్ అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు. వైద్యుల సూచనల ప్రకారం కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, చేతికి ఎలాంటి ఒత్తిడి కలిగించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. మూడు వారాల తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభించి, అనంతరం ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ దశలవారీగా సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం.

వైద్యుల సూచనలను పూర్తిగా పాటిస్తూ విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రజా, ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అభిమానులు, పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాయి.