BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా భూగర్భ జలాల అధికారి

తెలంగాణ
/ నల్గొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 10:27 PM
6 వీక్షణలు

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా భూగర్భ జలాల అధికారి

నల్గొండ రేంజ్ పరిధిలో మరోసారి అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపింది. సూర్యాపేట జిల్లా భూగర్భ జలాల శాఖలో జిల్లా భూగర్భ జలాల అధికారి మేఘవత్ బాలు, అవుట్‌సోర్సింగ్ డీఈఓ కోసనోజు వెంకటేశ్వర్లు రూ.20 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడి నుంచి అక్రమంగా లంచం డిమాండ్ చేసి, దానిని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ నల్గొండ రేంజ్ బృందం పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది. అనంతరం వారి వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకుని అవసరమైన రసాయన పరీక్షలు నిర్వహించారు.

ఈ ఘటనతో భూగర్భ జలాల శాఖలో కలకలం రేగింది. నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు.