రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా భూగర్భ జలాల అధికారి
రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా భూగర్భ జలాల అధికారి
నల్గొండ రేంజ్ పరిధిలో మరోసారి అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపింది. సూర్యాపేట జిల్లా భూగర్భ జలాల శాఖలో జిల్లా భూగర్భ జలాల అధికారి మేఘవత్ బాలు, అవుట్సోర్సింగ్ డీఈఓ కోసనోజు వెంకటేశ్వర్లు రూ.20 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుడి నుంచి అక్రమంగా లంచం డిమాండ్ చేసి, దానిని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ నల్గొండ రేంజ్ బృందం పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది. అనంతరం వారి వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకుని అవసరమైన రసాయన పరీక్షలు నిర్వహించారు.
ఈ ఘటనతో భూగర్భ జలాల శాఖలో కలకలం రేగింది. నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు.