BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 15 July 2026, 10:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కరెంట్ పోయిందా? ఇక వాట్సప్‌లోనే ఫిర్యాదు..

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 10:28 PM
92 వీక్షణలు

కరెంట్ పోయిందా? ఇక వాట్సప్‌లోనే ఫిర్యాదు.. తెలంగాణ విద్యుత్ శాఖ సరికొత్త సేవలు

హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. కరెంట్ కోతలు, లో-వోల్టేజ్, ట్రాన్స్‌ఫార్మర్ లోపాలు, విద్యుత్ సరఫరా అంతరాయాల వంటి సమస్యలను ఇక నుంచి నేరుగా వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తూ టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDSL) సరికొత్త సేవలను ప్రారంభించింది.

వినియోగదారుల సౌకర్యార్థం ప్రాంతాల వారీగా ప్రత్యేక వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేస్తోంది. ఈ గ్రూపుల ద్వారా సంబంధిత లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, సహాయ ఇంజనీర్ (ఏఈ)లను నేరుగా సంప్రదించి విద్యుత్ సమస్యలను వెంటనే తెలియజేయవచ్చు. దీంతో ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగ్గి, వేగంగా స్పందించే అవకాశం ఏర్పడనుంది.

ఇప్పటివరకు విద్యుత్ సమస్యల కోసం వినియోగదారులు ప్రధానంగా 1912 కాల్ సెంటర్‌పై ఆధారపడేవారు. అయితే కొత్త వాట్సప్ సేవలతో ఫిర్యాదులను మరింత వేగంగా స్వీకరించి, తక్షణ చర్యలు తీసుకోవడమే విద్యుత్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కొత్త విధానం అమల్లోకి రావడంతో విద్యుత్ కోతలు, మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్ లోపాలు, లో-వోల్టేజ్ వంటి సమస్యల పరిష్కారం మరింత సులభం కానుందని అధికారులు తెలిపారు. వినియోగదారులు తమ ప్రాంతానికి సంబంధించిన వాట్సప్ గ్రూపులో చేరి అవసరమైనప్పుడు నేరుగా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.