BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

సైబర్ బాధితులకు తీపికబురు.. 'మనీ రిస్టోరేషన్ మాడ్యూల్'తో డబ్బు వాపస్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:51 PM
15 వీక్షణలు

సైబర్ మోసాలకు గురై డబ్బు కోల్పోయిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో శుభవార్త తెలిపింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు తమ సొమ్మును సులభంగా తిరిగి పొందేందుకు 'మనీ రిస్టోరేషన్ మాడ్యూల్'ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి రీఫండ్‌కు సంబంధించిన ఎస్‌ఎంఎస్ లేదా నోటిఫికేషన్ అందుకున్న బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లోని ఈ మాడ్యూల్ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. చట్ట అమలు సంస్థలు, సంబంధిత బ్యాంకులు సంయుక్తంగా ధృవీకరించిన అనంతరం అర్హులైన బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రీఫండ్ నగదు జమ కానుంది. దీంతో సైబర్ మోసాల్లో చిక్కుకుని డబ్బు కోల్పోయిన వారికి త్వరితగతిన న్యాయం జరిగే అవకాశం ఏర్పడింది.

రీఫండ్ కోసం దరఖాస్తు చేసే విధానం

సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా బాధితులు సులభంగా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా సైబర్ ఫిర్యాదుకు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో పోర్టల్‌లో లాగిన్ కావాలి. అనంతరం మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా గుర్తింపును ధృవీకరించాలి. ఆ తర్వాత అర్హత కలిగిన ఫిర్యాదును, సంబంధిత బ్యాంకు ఖాతాను ఎంపిక చేసుకోవాలి. అవసరమైతే పాన్ కార్డు వివరాలను అప్లోడ్ చేయాలి. అనంతరం రీఫండ్‌కు సంబంధించిన వివరాలను మరోసారి పరిశీలించి దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు విజయవంతంగా నమోదైనట్లు నిర్ధారణ సందేశం వచ్చిన తర్వాత అధికారులు, బ్యాంకులు పరిశీలన పూర్తి చేసి అర్హులైన బాధితుల ఖాతాల్లోకి నేరుగా రీఫండ్ నగదు జమ చేయనున్నారు.