www.ntodaynews.com
ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్ పర్యవేక్షకులుగా డా. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్ పర్యవేక్షకులుగా డా. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ
మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్ పర్యవేక్షకులుగా (సూపరింటెండెంట్) డా. ఎం. అశోక్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం డా. అశోక్ కుమార్ నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు