BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 15 July 2026, 10:25 pm
Posted by : కూనురు మధు

​మిర్యాలగూడలో పోలీసుల తనిఖీలు 38 వాహనాలు సీజ్

తెలంగాణ
/ నల్గొండ / మిర్యాలగూడ
15 Jul, 2026 - 10:25 PM
59 వీక్షణలు

​​మిర్యాలగూడలో పోలీసుల తనిఖీలు : 38 వాహనాలు సీజ్ !     

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నేరాల నియంత్రణే ధ్యేయంగా పోలీసులు బుధవారం తెల్లవారుజామున విస్తృత తనిఖీలు చేపట్టారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్,  ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ఆకస్మిక సోదాల్లో సరైన పత్రాలు లేని 38 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. వన్ టౌన్ సీఐ నాగభూషణ్, టూ టౌన్ సీఐ సోమ నర్సయ్య, రూరల్ సీఐ పి.ఎన్.డి ప్రసాద్ నేతృత్వంలో 8 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారి మార్గాలు, ప్రవేశ-నిష్క్రమణ ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో ఏకకాలంలో నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. ​వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సోదాల్లో

​నంబర్ ప్లేట్లు లేనివి: 11 ద్విచక్ర వాహనాలు

​సరైన పత్రాలు లేనివి: 27 వాహనాలు మొత్తం 38 వాహనాలను సీజ్ చేశారు  ​నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 


* నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : డీఎస్పీ రవి


మిర్యాలగూడ పట్టణంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు., నేరాల నియంత్రణ కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి అని. వాహనదారులు తప్పనిసరిగా అన్ని రకాల పత్రాలను కలిగి ఉండాలి అని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ, తమ పరిధిలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా గుర్తుతెలియని వ్యక్తులు  తిరుగుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. రాత్రి వేళల్లో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న అనుమానితుల వివరాలను సేకరించడంతో పాటు, పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.