BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

నరసాపురం, తాతకుంట్లలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:52 PM
82 వీక్షణలు

రైతులకు శాస్త్రీయ సాగు విధానాలపై అవగాహన

విస్సన్నపేట, జూలై 15: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలోని నరసాపురం, తాతకుంట్ల గ్రామాల్లో బుధవారం మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు నేరుగా పొలాల్లోనే శాస్త్రీయ సాగు పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ఈ సందర్భంగా సూచించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల యాజమాన్య పద్ధతులు, సమతుల్య ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ చర్యలు, పంటలను తరచూ పరిశీలిస్తూ వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని రైతులకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సేవలు, రైతు సేవా కేంద్రాల ద్వారా లభించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఓ బి. వాసవి సౌజన్య, ఏఈఓ ఉషారాణి, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొని రైతులకు పలు సూచనలు అందించారు. గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హాజరై వ్యవసాయ నిపుణుల సలహాలు తెలుసుకుని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.