జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసన పల్లె నందు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ...
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసన పల్లె నందు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ...
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసన పల్లె నందు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి HM అమర్ నాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదని విద్యార్థులు చక్కగా చదువుకోవాలని కోరారు. సింగిల్ విండో అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్యతో పాటు, యూనిఫాం,పుస్తకాలు, బ్యాగులు, షూలు, బెల్ట్ లు, రుచికరమైన మధ్యాహ్న భోజనం తో పాటు కోడి గుడ్లు, మిల్లెట్స్ తో తయారు చేసిన చిక్కీలు ఇస్తున్నదని విద్యార్థులు వీటిని చక్కగా ఉపయోగించుకోవాలని వివరించారు. జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వర రెడ్డి, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు భాస్కర్ లు మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన విద్య, తో పాటు అమ్మకు వందనం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నదని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో SMC ఛైర్మన్ శ్రీమతి శోభా రెడ్డెప్ప, మణి, ఉపాధ్యాయులు నాగమల్లిక,ప్రేమ కుమార్, మనోహర్, రామాంజులు, శ్రీనివాసన్, ప్రసూన, శరత్ తదితరులు పాల్గొన్నారు.