www.ntodaynews.com
గోల్కొండలో ఘనంగా ఆషాడ బోనాల ఆరంభం..
తెలంగాణ
గోల్కొండలో ఘనంగా ఆషాడ బోనాల ఆరంభం.. జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణ
హైదరాబాద్లోని గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఆషాడ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి సురేఖ పేర్కొన్నారు.