BREAKING
మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం
Date of Publish : 01 June 2026, 04:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 04:39 PM
114 వీక్షణలు

చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందించే విధానాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పెన్షన్ పొందుతున్న భర్త మరణిస్తే, తదుపరి నెల నుంచే స్పౌజ్ పెన్షన్ కింద భార్యకు పెన్షన్ అందజేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదేనని చెప్పారు.

అలాగే రాష్ట్రంలోని అర్హులైన వితంతువులందరికీ ఈ నెల 12వ తేదీన కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మిద్దె అంజి, బుస్సు తిరుపతయ్య, ఎడ్ల రాములు, బాల్ధ భూషణం, కంచు బాబు, సంగుంది సత్యనారాయణ, వీఆర్‌వో శోభన్‌బాబు, వీఏఏ నాగమణి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.