BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 04:39 PM
36 వీక్షణలు

చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందించే విధానాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పెన్షన్ పొందుతున్న భర్త మరణిస్తే, తదుపరి నెల నుంచే స్పౌజ్ పెన్షన్ కింద భార్యకు పెన్షన్ అందజేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదేనని చెప్పారు.

అలాగే రాష్ట్రంలోని అర్హులైన వితంతువులందరికీ ఈ నెల 12వ తేదీన కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మిద్దె అంజి, బుస్సు తిరుపతయ్య, ఎడ్ల రాములు, బాల్ధ భూషణం, కంచు బాబు, సంగుంది సత్యనారాయణ, వీఆర్‌వో శోభన్‌బాబు, వీఏఏ నాగమణి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.