BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 16 July 2026, 09:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఊటుకూరులో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం.. మరో ద్విచక్ర వాహనానికి మంటలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jul, 2026 - 09:17 PM
86 వీక్షణలు

ఊటుకూరులో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం.. మరో ద్విచక్ర వాహనానికి మంటలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో గురువారం ఎలక్ట్రిక్ బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలోని ఓ దుకాణం ముందు నిలిపిన ఎలక్ట్రిక్ బైక్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బైక్ పూర్తిగా కాలిపోగా, పక్కనే పార్క్ చేసిన మరో ద్విచక్ర వాహనానికి కూడా మంటలు అంటుకున్నాయి.

హఠాత్తుగా మంటలు ఎగసిపడటంతో అక్కడ ఉన్న వ్యాపారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు నీరు, ఇసుకతో మంటలను అదుపులోకి తీసుకువచ్చి మరింత ప్రమాదం జరగకుండా నివారించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి కావడంతో యజమానులకు నష్టం వాటిల్లింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.