BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Jun, 2026 - 07:19 PM
25 వీక్షణలు

బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. 

అన్నమయ్య జిల్లా

చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలి.

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ..

మదనపల్లె, జూన్ 01: అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను జిల్లా *ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* గారి దృష్టికి తీసుకెళ్లారు. స్వయంగా అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులపై వేధింపులు, గృహహింస, భూవివాదాలు, నకిలీ పత్రాల సృష్టి, అధిక వడ్డీల వేధింపులు, ఆన్‌లైన్ మరియు ప్రేమ పేరుతో జరిగిన మోసాలపై బాధితులు ఎస్పీ గారికి స్వేచ్ఛగా విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ  సంబంధిత అధికారులతో అప్పటికప్పుడే ఫోన్‌లో మాట్లాడి, బాధితులకు చట్ట పరిధిలో సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను వెంటనే జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి తక్షణమే విచారణ జరపాలని అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని వారు తమ స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ లేదా సబ్ డివిజన్ కార్యాలయాల్లో సైతం ఫిర్యాదు చేయవచ్చని, ఆయా ఫిర్యాదులను కూడా 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' అర్జీలుగానే పరిగణించి సకాలంలో న్యాయం చేస్తామని ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ప్రజలకు భరోసా ఇచ్చారు.