www.ntodaynews.com
మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..!
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..!
మేడ్చల్ జిల్లా శామీర్పేట తహసీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్వో సుచరిత రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం.
బొమ్మరాస్పేట్ ప్రాంతంలోని భూముల వ్యవహారాన్ని క్లియర్ చేసేందుకు భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టగా, కార్యాలయానికి సంబంధించిన పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో కలకలం రేపగా, పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.