BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

చనుబండ శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Mar, 2026 - 05:43 AM
172 వీక్షణలు

చనుబండ శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం.. పటిష్ట పోలీస్ బందోబస్తు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం:

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కోదండ రామాలయం వద్ద నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది.

ఈ సందర్భంగా నూజివీడు డిఎస్పి కె.వి.వి.ఎన్.వి ప్రసాద్, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ ఆదేశాల మేరకు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ తన పోలీస్ సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆధ్యాత్మిక ఉత్సవాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

ఉత్సవానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.