చనుబండ శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం..
చనుబండ శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం.. పటిష్ట పోలీస్ బందోబస్తు
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం:
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కోదండ రామాలయం వద్ద నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా నూజివీడు డిఎస్పి కె.వి.వి.ఎన్.వి ప్రసాద్, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ ఆదేశాల మేరకు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ తన పోలీస్ సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆధ్యాత్మిక ఉత్సవాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
ఉత్సవానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.