www.ntodaynews.com
మొక్కజొన్న రైతులకు తీవ్ర దెబ్బ!
ఆంధ్రప్రదేశ్
ఈదురు గాలులు–అకాల వర్షాలు... మొక్కజొన్న రైతులకు తీవ్ర దెబ్బ!
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. మండల వ్యవసాయ అధికారి షేక్ టిప్పు సుల్తాన్, వ్యవసాయ విస్తరణ అధికారి జి. ఉషారాణి రైతులతో కలిసి ప్రభావిత పంటలను పరిశీలించారు.
మండలంలోని కలగర, కొర్లమండ, నర్సాపురం గ్రామాల్లో పంటలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మొత్తం విస్సన్నపేట మండలంలో సుమారు 65 హెక్టార్లలో మొక్కజొన్న పంట నష్టపోయిందని అంచనా వేశారు.
ఈ నష్టం పై ప్రాథమిక నివేదికను జిల్లా వ్యవసాయ అధికారులకు పంపినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే రైతు సేవా కేంద్రాల క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి స్థాయి పంట నష్టం గణన చేపడతారని అధికారులు తెలిపారు.