BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

మొక్కజొన్న రైతులకు తీవ్ర దెబ్బ!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 07:42 PM
53 వీక్షణలు

ఈదురు గాలులు–అకాల వర్షాలు... మొక్కజొన్న రైతులకు తీవ్ర దెబ్బ!

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. మండల వ్యవసాయ అధికారి షేక్ టిప్పు సుల్తాన్, వ్యవసాయ విస్తరణ అధికారి జి. ఉషారాణి రైతులతో కలిసి ప్రభావిత పంటలను పరిశీలించారు.

మండలంలోని కలగర, కొర్లమండ, నర్సాపురం గ్రామాల్లో పంటలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మొత్తం విస్సన్నపేట మండలంలో సుమారు 65 హెక్టార్లలో మొక్కజొన్న పంట నష్టపోయిందని అంచనా వేశారు.

ఈ నష్టం పై ప్రాథమిక నివేదికను జిల్లా వ్యవసాయ అధికారులకు పంపినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే రైతు సేవా కేంద్రాల క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి స్థాయి పంట నష్టం గణన చేపడతారని అధికారులు తెలిపారు.