BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 20 March 2026, 07:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మొక్కజొన్న రైతులకు తీవ్ర దెబ్బ!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 07:42 PM
161 వీక్షణలు

ఈదురు గాలులు–అకాల వర్షాలు... మొక్కజొన్న రైతులకు తీవ్ర దెబ్బ!

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. మండల వ్యవసాయ అధికారి షేక్ టిప్పు సుల్తాన్, వ్యవసాయ విస్తరణ అధికారి జి. ఉషారాణి రైతులతో కలిసి ప్రభావిత పంటలను పరిశీలించారు.

మండలంలోని కలగర, కొర్లమండ, నర్సాపురం గ్రామాల్లో పంటలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మొత్తం విస్సన్నపేట మండలంలో సుమారు 65 హెక్టార్లలో మొక్కజొన్న పంట నష్టపోయిందని అంచనా వేశారు.

ఈ నష్టం పై ప్రాథమిక నివేదికను జిల్లా వ్యవసాయ అధికారులకు పంపినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే రైతు సేవా కేంద్రాల క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి స్థాయి పంట నష్టం గణన చేపడతారని అధికారులు తెలిపారు.