గిద్దలూరులో నోటరీ పబ్లిక్గా తిరుమల ప్రసాద్ నియామకం
గిద్దలూరులో నోటరీ పబ్లిక్గా తిరుమల ప్రసాద్ నియామకం
మార్కాపురం జిల్లా గిద్దలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఏ. తిరుమల ప్రసాద్ను ప్రభుత్వ నోటరీ పబ్లిక్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
గిద్దలూరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న తిరుమల ప్రసాద్ న్యాయవాదిగా ప్రజలకు అందించిన సేవలతో మంచి గుర్తింపు పొందారు. తాజాగా నోటరీ పబ్లిక్గా నియమితులు కావడంతో పలువురు న్యాయవాదులు, మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సహాయం అవసరమైనా, నోటరీకి సంబంధించిన అఫిడవిట్లు తదితర సేవలు కావాలన్నా అందుబాటులో ఉంటానని తెలిపారు. గిద్దలూరు పట్టణంలోని వైఎస్సార్ సెంటర్లో ఉన్న తన కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సేవలు అందిస్తానని పేర్కొన్నారు.