www.ntodaynews.com
అమరావతి: ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా కొణిదెల నాగబాబు బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా కొణిదెల నాగబాబు బాధ్యతల స్వీకరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రీచ్మెంట్ (ఏపీ గ్రీన్) సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా జనసేన పార్టీ శాసన మండలి సభ్యుడు కొణిదెల నాగబాబు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొని బాధ్యతలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, అటవీ విస్తరణ కార్యక్రమాలకు ఏపీ గ్రీన్ సొసైటీ ద్వారా మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.