నర్సీపట్నంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ సీనియర్ అకౌంటెంట్ అరెస్ట్
నర్సీపట్నంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ సీనియర్ అకౌంటెంట్ అరెస్ట్
రిటైర్డ్ ఎంఆర్ఓ నుంచి రూ.30 వేలు స్వీకరిస్తుండగా పట్టివేత
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఉపఖజానా కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రిటైర్డ్ ఎంఆర్ఓ నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న సీనియర్ అకౌంటెంట్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఇంక్రిమెంట్ ఏరియర్స్ బిల్లు మంజూరు చేయడానికి సదరు అధికారి రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. అనంతరం రూ.30 వేలు చెల్లించేలా ఒప్పందం కుదిరిన నేపథ్యంలో లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
ప్రస్తుతం నర్సీపట్నం ఉపఖజానా కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.