BREAKING
గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం
www.ntodaynews.com

గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
23 Jun, 2026 - 10:12 PM
35 వీక్షణలు

గొల్లప్రోలు | కాకినాడ జిల్లా | N Today News

గొల్లప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ప్లాన్ (GPDP)పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు మరియు వి.ఓ.ఏలు పాల్గొన్నారు.

శిక్షణ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అమలు విధానం, ప్రజల అవసరాల గుర్తింపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి తహసీల్దార్ బి.వి. భాస్కర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) ఎన్. సెలట్ రాజు, జీఎస్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీఓ చి. వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు అవసరమని, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) లక్ష్యాలను విజయవంతం చేయాలని సూచించారు.

డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాభివృద్ధి ప్రణాళికల తయారీలో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడం ద్వారా గ్రామాల పురోగతిని మరింత వేగవంతం చేయవచ్చని తెలిపారు