www.ntodaynews.com
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్
అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో ఫైవ్ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదేవిధంగా అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల కోసం భూముల కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా అనుమతి మంజూరు చేసింది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జులై 3న కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.