www.ntodaynews.com
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
జాతీయం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ వేదికగా విడుదల చేసింది. అయితే సమావేశం అజెండాపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఇటీవల కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దేశవ్యాప్తంగా ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణ పరిపాలనా అంశాలు, కీలక ప్రభుత్వ నిర్ణయాలు లేదా రాజ్యాంగపరమైన విషయాలపై రాష్ట్రపతి, ప్రధాని మధ్య తరచూ సమావేశాలు జరుగుతుంటాయి. అయితే తాజా సమావేశం వెనుక ఉన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భేటీపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.