హిందూపురం ఘటనకు నిరసనగా తిరువూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ
హిందూపురం ఘటనకు నిరసనగా తిరువూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ
తిరువూరు, ఆగస్టు 4:
కృష్ణా జిల్లా న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.
జూలై 31న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని మాతృశ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ చేపట్టిన ధర్నా సందర్భంగా వన్టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు దురుసుగా ప్రవర్తించి, దూషించడమే కాకుండా బూటు కాలితో తన్నారని న్యాయవాదులు ఆరోపించారు.
ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన తిరువూరు న్యాయవాదులు, సంబంధిత సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయవాదులపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని, న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంకురాత్రి జనార్దన్ రావు, ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి కృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాదులు చింతల వెంకటరెడ్డి, మర్సకట్ల కుమార్, వాకధాని లక్ష్మీనారాయణ, మాకరాజు రామ్మోహన్, మునగాల అప్పారావు రాజు, అంకిరెడ్డి అంజనరెడ్డి, కొత్తపల్లి ఆనంద స్వరూప్, కోట జమలయ్య, చింతా బత్తిన రాజేంద్రబాబు, షేక్ గౌస్, ఎస్.కే. సుభాని, రావూరి నాగరాజు, కనపర్తి రాంబాబు, కారుమంచి సునీల్, భూక్య రామారావు, బండ్రపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.