BREAKING
హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ
www.ntodaynews.com

సర్కార్ బడికి ‘ఇంటర్ నెట్’ వస్తోంది

తెలంగాణ
07 Feb, 2026 - 09:58 PM
178 వీక్షణలు
సర్కార్ బడికి ‘ఇంటర్ నెట్’ వస్తోంది జూన్ నాటికి మరో 6,307 ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం NTODAY NEWS: హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ మౌలిక వసతులను విస్తరించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కొత్తగా 8,956 ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది. ఇందులో భాగంగా గత రెండు నెలల్లోనే 2,649 పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్షన్ ప్రారంభమైంది. మిగిలిన 6,307 పాఠశాలలకు జూన్ నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. బీఎస్ఎన్ఎల్, టీ-ఫైబర్‌తో ఒప్పందాలు ఇంటర్నెట్ సౌకర్యం కల్పనకు విద్యాశాఖ బీఎస్ఎన్ఎల్ (BSNL), టీ-ఫైబర్ (T-Fiber) సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మొత్తం 8,956 పాఠశాలల్లో: 5,354 పాఠశాలలకు డిజిటల్ భారత్ నిధుల కింద బీఎస్ఎన్ఎల్ ద్వారా ఉచిత ఇంటర్నెట్ 674 పాఠశాలలకు టీ-ఫైబర్ విభాగం ఉచితంగా నెట్ సదుపాయం ఈ విధంగా 6,028 పాఠశాలలకు ఎలాంటి చార్జీలు లేకుండా ఇంటర్నెట్ అందనుంది. చెల్లింపు ప్రాతిపదికన మరో 2,928 పాఠశాలలు మిగిలిన 2,928 ప్రభుత్వ పాఠశాలలకు చెల్లింపు ప్రాతిపదికన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఒప్పందాలు జరిగాయి. బీఎస్ఎన్ఎల్: నెలకు పాఠశాలకి రూ.599 టీ-ఫైబర్: నెలకు పాఠశాలకి రూ.900 జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర స్థితి ఇంటర్నెట్ సౌకర్యం విషయంలో రాష్ట్రం గతంలో జాతీయ సగటుతో పోలిస్తే వెనుకబడి ఉంది. 2023–24 విద్యా సంవత్సరం జాతీయ సగటు: 50.5% రాష్ట్రంలో ఇంటర్నెట్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు: 21.90% 2024-2025 జాతీయ సగటు జాతీయ సగటు: 58.60% రాష్ట్రంలో ఇంటర్నెట్ ఉన్న పాఠశాలలు: 52.90% కొత్తగా 8,956 పాఠశాలలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే, రాష్ట్ర ర్యాంకు జాతీయ స్థాయిలో మెరుగుపడనుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల పరిధిలో మొత్తం 30,038 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో పాఠశాలలకు డిజిటల్ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. Follow us on Website Facebook Instagram YouTube