BREAKING
​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత..
www.ntodaynews.com

బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
16 Apr, 2026 - 03:17 PM
187 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా,​రాజాపేట మండలం, చల్లూరు గ్రామంలోని 322 సర్వే నెంబర్ క్రషర్ వ్యవహారంలో చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాల్ ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి స్వాగతించారు. వివాదాస్పదంగా మారిన సదరు క్రషర్ వద్దే ఈ బహిరంగ చర్చ నిర్వహిద్దామని, ఎమ్మెల్యే బిజీ షెడ్యూల్ దృష్ట్యా మీరు తేదీని ఖరారు చేస్తే తాము రావడానికి సిద్ధమని ప్రకటించారు.జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టుల సాక్షిగా ఈ చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ​చల్లూరులో రాత్రింబగళ్లు అక్రమంగా బ్లాస్టింగ్‌లు జరుగుతున్నా  ఎందుకు మౌనంగా ఉన్నారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా పేరుతో కేసులు పెడతామని బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు.కేవలం మాటలకే పరిమితం కాకుండా, తక్షణమే సదరు క్రషర్ కార్యకలాపాలను నిలిపివేయించి విచారణ జరిపించడం ద్వారా ఎమ్మెల్యే తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు