BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
16 Apr, 2026 - 03:17 PM
121 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా,​రాజాపేట మండలం, చల్లూరు గ్రామంలోని 322 సర్వే నెంబర్ క్రషర్ వ్యవహారంలో చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాల్ ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి స్వాగతించారు. వివాదాస్పదంగా మారిన సదరు క్రషర్ వద్దే ఈ బహిరంగ చర్చ నిర్వహిద్దామని, ఎమ్మెల్యే బిజీ షెడ్యూల్ దృష్ట్యా మీరు తేదీని ఖరారు చేస్తే తాము రావడానికి సిద్ధమని ప్రకటించారు.జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టుల సాక్షిగా ఈ చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ​చల్లూరులో రాత్రింబగళ్లు అక్రమంగా బ్లాస్టింగ్‌లు జరుగుతున్నా  ఎందుకు మౌనంగా ఉన్నారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా పేరుతో కేసులు పెడతామని బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు.కేవలం మాటలకే పరిమితం కాకుండా, తక్షణమే సదరు క్రషర్ కార్యకలాపాలను నిలిపివేయించి విచారణ జరిపించడం ద్వారా ఎమ్మెల్యే తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు