BREAKING
తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ
Date of Publish : 16 April 2026, 03:17 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
16 Apr, 2026 - 03:17 PM
267 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా,​రాజాపేట మండలం, చల్లూరు గ్రామంలోని 322 సర్వే నెంబర్ క్రషర్ వ్యవహారంలో చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాల్ ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి స్వాగతించారు. వివాదాస్పదంగా మారిన సదరు క్రషర్ వద్దే ఈ బహిరంగ చర్చ నిర్వహిద్దామని, ఎమ్మెల్యే బిజీ షెడ్యూల్ దృష్ట్యా మీరు తేదీని ఖరారు చేస్తే తాము రావడానికి సిద్ధమని ప్రకటించారు.జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టుల సాక్షిగా ఈ చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ​చల్లూరులో రాత్రింబగళ్లు అక్రమంగా బ్లాస్టింగ్‌లు జరుగుతున్నా  ఎందుకు మౌనంగా ఉన్నారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా పేరుతో కేసులు పెడతామని బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు.కేవలం మాటలకే పరిమితం కాకుండా, తక్షణమే సదరు క్రషర్ కార్యకలాపాలను నిలిపివేయించి విచారణ జరిపించడం ద్వారా ఎమ్మెల్యే తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు