BREAKING
​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత..
www.ntodaynews.com

అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
16 Apr, 2026 - 08:29 PM
46 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల డ్రైవ్ కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభమైంది. ఇందులో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, పోలిరెడ్డి పాలెం పరిధిలో అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తూ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పోషకాహారం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో ఉచిత యూనిఫామ్‌లు, అలాగే ఉచిత పాఠ్యపుస్తకాలు, షూ, బెల్ట్, సాక్స్ పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు డిజిటల్ విధానంలో అత్యున్నత ప్రమాణాలతో బోధన అందిస్తున్నామని వివరించారు.

వైఎస్ఆర్ కాలనీ, మదర్ తెరెసా కాలనీ, లక్ష్మీనరసింహ కాలనీ, పోలిరెడ్డిపాలెం, కొండ్రుపాడు ప్రాంతాల విద్యార్థులు సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేరి ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఫౌండేషన్ లిటరసీ స్కిల్స్ (FLS) పరీక్షను పరిశీలించారు. కార్యక్రమంలో విద్యార్థులు “ప్రభుత్వ బడి – చదువుల గుడి”, “ఇంటింటా చదువు – ఊరంతా వెలుగు”, “పెద్దలు పనికి – పిల్లలు బడికి”, “బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించండి” వంటి నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జై హైమావతి, ఉపాధ్యాయులు పి. శైలజ, పోటు శ్రీనివాసరావు, జి. ఆదిలక్ష్మి, కె. అరుణ, సిహెచ్. నవ్యశ్రీ, సీఆర్పీ శివ పార్వతి మరియు పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.