హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం
హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తాహసిల్దారులకు వినతి పత్రం --TGRSA జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండం వెంకట్ రెడ్డి, బి.పల్లవి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అనగా 17.04.2026 మధ్యాహ్నం 1:00 గంటకు భోజన సమయములో జులై రెండవ తేదీ నాటికి పిఆర్సి అమలు పరచాలని,రిటైర్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని, హెల్త్ కార్డు తక్షణమే అమలు చేయాలని, సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ విధానాన్ని పునరుద్దించాలని, 2004 సెప్టెంబర్ 16వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపిఎస్ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులతో పాటు పెండింగ్ డిఏ లను విడుదల చేయాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాల నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని ఉన్న మన డిమాండ్ల సాధన కోసం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ మండలాల తహశీల్దార్లకు వినతి పత్రం ఇవ్వగలరని TGRSA జిల్లా అధ్యక్షులు కొండం వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ బి.పల్లవి నేడు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో TGRSA ప్రతినిధులు GPO లు అందరూ పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు ఈ క్రింద చూపిన TGRSA ప్రతినిధులు GPO లతో సమన్వయం చేసుకొని తహశీల్దార్ లకు వినతి పత్రం సమర్పించి అట్టి ఫోటోలను గ్రూప్ లో షేర్ చేయగలరు ప్రతినిధులను కోరారు
1.పూర్ణ చందర్, ఆలేరు 2.CH లోకేందర్ రెడ్డి, భువనగిర 3.బి.బాలమణి, బీబీనగర్ 4. ఎస్.సునీల్ కుమార్, బొమ్మలరామారం 5. పి.నర్సింహ,రాజాపేట 6.ప్రభుదాస్,గుండాల. 7. జయలక్ష్మి, ముటకొండూరు 8.సుమన్, మోత్కూర్ 9.మాధవ రెడ్డి,తుర్కపల్లి 10.రామారావు, యాదగిరి గుట్ట.11.మల్లిఖార్జున రావు, ఆత్మకూరు.12. శ్రీనివాస్,అడ్డగూడూరు. 13.గుట్ట వెంకట్ రెడ్డి,పోచంపల్లి.14. నగేష్ కుమార్,వలిగొండ15.గాలయ్య,రామన్నపేట. 16.శ్రీనివాస్,నారాయణపూర్17.పి.సిద్ధార్థ కుమార్, చౌటుప్పల్ 18.రాధా మేడం డీఈవో RDO కార్యాలయం భువనగిరి