www.ntodaynews.com
జన్వాడ కోడి చెరువు భూములపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలు
తెలంగాణ
జన్వాడ కోడి చెరువు భూములపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలు
హైదరాబాద్లోని జన్వాడ కోడి చెరువు పరిధిలో ఉన్న భూములపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ 2014లో కొనుగోలు చేసిన భూమిలో కొంత భాగం చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం (FTL) పరిధిలో ఉందని తెలిపారు.
మొత్తం భూమిలో సుమారు 6 నుంచి 7 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నాయని, మిగిలిన 3 నుంచి 4 ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్కు వెలుపల ఉన్నాయని పేర్కొన్నారు. చెరువు పరిధిలో ఫెన్సింగ్ వేసి ఆక్రమించినట్లు గుర్తించామని, చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఎలాంటి ఫెన్సింగ్ లేదా నిర్మాణాలు అనుమతించబడవని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.