పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై డీపీవో ఆకస్మిక తనిఖీలు
పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై డీపీవో ఆకస్మిక తనిఖీలు
ఏలూరు: ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మజిగూడెంలో జిల్లా కలెక్టర్ కార్యక్రమం ముగిసిన అనంతరం జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) జి.వి.కె. మల్లికార్జునరావు పీజీఆర్ఎస్లో నమోదైన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా బోగోలు, కలరాయనగూడెం గ్రామపంచాయతీలను సందర్శించి, ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన సూచనలు చేశారు.
ఈ తనిఖీల్లో డివిజనల్ పంచాయతీ అధికారి ఎం.పి.ఎన్. సుందరి, డిప్యూటీ ఎంపీడీవో ఎ. సుందరి, సంబంధిత గ్రామపంచాయతీల అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, పారిశుద్ధ్యం, తాగునీటి సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని డీపీవో ఆదేశించారు.