BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మోదీ, అమిత్ షాలతో జగన్ భేటీ..? రాజకీయ వర్గాల్లో చర్చ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 12:43 AM
7 వీక్షణలు

మోదీ, అమిత్ షాలతో జగన్ భేటీ..? రాజకీయ వర్గాల్లో చర్చ

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పార్లమెంట్ కార్యాలయంలో భేటీ కానున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ భేటీలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు తాను మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తన పార్టీకి అన్యాయం జరగకుండా చూడాలని జగన్ కోరనున్నారని సమాచారం. పునర్విభజన పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కాకుండా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది.

ముఖ్యంగా పులివెందుల, పుంగనూరు వంటి నియోజకవర్గాలను ఎస్సీ రిజర్వ్‌గా మార్చే అవకాశం ఉందనే ఊహాగానాల నేపథ్యంలో, తాను బిల్లుకు మద్దతు ఇస్తున్న సమయంలో కూటమికి అనుకూలంగా పునర్విభజన జరగడం సరికాదనే అభిప్రాయాన్ని ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే, ఈ భేటీపై గానీ, అందులో చర్చించబోయే అంశాలపై గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇవి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారాలుగానే ఉన్నాయి.