సత్తా చాటిన మంచిర్యాల ఆర్టీఏ.. అధికారులకు డీటీసీ ప్రశంసలు
ఓవర్ లోడ్ కేసులు, ఆదాయ సాధనపై అభినందనలు
ఆర్సీ, డీఎల్ కార్డుల పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశం
మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మంచిర్యాల ఆర్టీఏ అధికారులు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నారని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) రవీందర్ కుమార్ ప్రశంసించారు. ఉమ్మడి జిల్లా కార్యాలయాల పర్యటనలో భాగంగా ఆయన మంచిర్యాల ఆర్టీఏ కార్యాలయంలో సాధారణ తనిఖీలు నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఆదాయ లక్ష్యాన్ని సాధించడంతో పాటు, ఓవర్ లోడ్ వాహనాలపై అత్యధిక కేసులు నమోదు చేయడం పట్ల అధికారులను, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మున్ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ ఆదాయ లక్ష్యాలను చేరుకోవాలని, ఓవర్ లోడ్ వాహనాలపై నిఘా కొనసాగించాలని సూచించారు. అలాగే, వాహనదారులకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పంపిణీ (డిస్పాచ్) చేయాలని ఆదేశించారు