BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

TGREDCO డీఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ సోదాలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 09:31 PM
14 వీక్షణలు

TGREDCO డీఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న టీజీఆర్‌ఈడీసీఓ (TGREDCO) డీఈ ముత్యం వెంకటరమణ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం విస్తృత సోదాలు నిర్వహించారు. మాదాపూర్ నివాసంతో పాటు రాష్ట్రంలోని మరో 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

అధికారిక సమాచారం ప్రకారం, ముత్యం వెంకటరమణ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా ఈ దాడులు నిర్వహించారు. సోదాల్లో నగదు, బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లాకర్లు, పెట్టుబడుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాల విలువ, అక్రమాస్తుల వివరాలను లెక్కించే ప్రక్రియ కొనసాగుతోంది.

కాగా, ముత్యం వెంకటరమణ గతంలో 2019లో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో డీఈగా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆ సమయంలో కూడా ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీ మొత్తంలో అక్రమాస్తులను గుర్తించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కొనసాగుతున్న సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు, స్వాధీనం చేసిన ఆస్తుల విలువపై ఏసీబీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.