కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ పేపర్లు లీక్ అయ్యాయి: జేపీ నడ్డా
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ పేపర్లు లీక్ అయ్యాయి: జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పరీక్షా పత్రాల లీకేజీల అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లేదా ప్రతిపక్షాలు పాలిస్తున్న పలు రాష్ట్రాల్లో కూడా పరీక్షా పత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయిన ఘటనలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షా పత్రం, పంజాబ్లో గ్రూప్-డి పరీక్షా పత్రం లీక్ అయిన సంఘటనలను ఉదాహరణగా పేర్కొన్నారు.
పరీక్షా పత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా వ్యవస్థాపరమైన సమస్యగా చూడాలని నడ్డా అభిప్రాయపడ్డారు. ఈ తరహా ఘటనలపై తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.