www.ntodaynews.com
ఐదు తరగతులకు ఒక్కడే ఉపాధ్యాయుడు
తెలంగాణ
ఐదు తరగతులకు ఒక్కడే ఉపాధ్యాయుడు
NTODAY NEWS: చిట్యాల
విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆందోళన
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో టీచర్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నేరడ ప్రాథమిక పాఠశాలలో మొత్తం ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు 27 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటంచే ఎటువంటి ఇబ్బంది లేకుండా పాఠ్యాంశాలు సాఫీగా సాగిపోయావని మరొక ఉపాధ్యాయుడు పదోన్నతి పై బదిలీ కావడంతో ఒకే ఉపాధ్యాయుడు వీరికి బోధిస్తున్నారు. అన్ని తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం లో ఇబ్బందికరంగా మారిందని, విద్యార్థులకు సమయానుగుణం గా పాఠ్యాంశాలు అయిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అంతేకాకుండా ఒకే ఉపాధ్యాయుడు ఉండడం చేత అన్ని తరగతుల విద్యార్థులను ఒకే తరగతిలో కూర్చోబెట్టి బోధించడంతో విద్యార్థులు ఎంతో అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలకు కావలసిన టీచర్లను నియమించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube