www.ntodaynews.com
మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల, ఏప్రిల్ 17
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచే కార్యాలయంలోకి ప్రవేశించిన అధికారులు, లోపలికి ఎవరినీ రానీయకుండా ప్రధాన గేట్లు మూసివేసి సోదాలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో ప్రధానంగా గత కొంతకాలంగా జరిగిన రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు, ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో ఇక్కడ ఏసీబీ సోదాలు జరిగిన నేపథ్యంలో, తాజాగా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగడం సంచలనంగా మారింది. ఇంకా తనిఖీలు కొనసాగుతుండటంతో కార్యాలయ సిబ్బందిలో ఆందోళన నెలకొంది