BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

విద్యార్థుల భవితవ్యానికి ఉపాధ్యాయులే పునాదులు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
17 Apr, 2026 - 04:11 PM
24 వీక్షణలు

విద్యార్థుల భవితవ్యానికి ఉపాధ్యాయులే పునాదులు. ఆర్థిక భద్రత నేర్పించడం అభినందనీయం. వెల్గటూర్ మండల తహసిల్దార్ శేఖర్.

సొంత ఖర్చుతో 28 మంది బాలికలకు ఖాతాలు తీయించిన ఉపాధ్యాయులు

విద్యార్థినులకు ఉపాధ్యాయుల 'సుకన్య' కానుక

​అభినందించిన తహసీల్దార్‌ శేఖర్‌

​తహసీల్దార్ శేఖర్ చేతుల మీదుగా పాస్‌బుక్కుల పంపిణీ

ఉపాధ్యాయుల ఉదారత: 28 మంది విద్యార్థినులకు 'సుకన్య సమృద్ధి' ఖాతాలు

​తహసీల్దార్ శేఖర్ చేతుల మీదుగా పాస్‌బుక్కుల పంపిణీ

​వెల్గటూర్, ఏప్రిల్ 17: విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే పునాదులని, వారు కేవలం చదువుకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో ఆర్థిక భద్రత పట్ల అవగాహన కల్పించడం అభినందనీయమని వెల్గటూర్ మండల తహసీల్దార్ శేఖర్ అన్నారు. మండలంలోని పాశిగామ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సంపత్ కుమార్ మరియు మహేష్‌లు తమ సొంత ఖర్చులతో 28 మంది బాలికలకు 7,500 రూపాయల విలువగల సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తహసీల్దార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు ఖాతా పుస్తకాలను అందజేశారు.

​సమాజానికి ఆదర్శంగా ఉపాధ్యాయులు:

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. పాశిగామ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాలతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రాథమిక దశలోనే బాలికల భవిష్యత్తు కోసం ఆర్థిక భరోసా కల్పించడం గొప్ప విషయమని వారిని ప్రత్యేకంగా అభినందించారు.

​ఉన్నత చదువులకు భరోసా:

మండల విద్యాధికారి (MEO) ప్రభాకర్ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే ప్రారంభించిన ఈ పొదుపు ఖాతాలు విద్యార్థినులు భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. సామాజిక బాధ్యతగా భావించి ఈ కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయులను ఆయన శ్లాఘించారు.

​మహిళా సాధికారత కోసమే:

ప్రధానోపాధ్యాయులు సంపత్ మాట్లాడుతూ.. కుటుంబ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర కీలకమని, బాలికల విద్య మరియు వివాహ అవసరాల కోసం ఈ ఖాతాలను అందజేసినట్లు తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.

​ఘనంగా సన్మానం:

తమ వేతనం నుండి విద్యార్థుల కోసం వెచ్చించిన ఉపాధ్యాయులు సంపత్ కుమార్, మహేష్‌లను సబ్ పోస్ట్ మాస్టర్, తపాలా సిబ్బంది, గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్‌లు ఘనంగా సన్మానించారు.

​ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాండ్రపు శిరీష, ఉప సర్పంచ్ కొత్తూరు భూమయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రణీత, రజిత, ప్రవళిక, సబ్ పోస్ట్ మాస్టర్ కమలాకర్, మౌనిక, సుధాకర్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు