పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత…
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత… ఆకివీడులో ఉద్రిక్త పరిస్థితులు
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పై దాడికి యత్నం జరిగినట్లు సమాచారం.
పెడపేట రామాలయానికి వెళ్లిన రఘురామను ఒక వర్గం అడ్డుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి చేరుకున్న కూటమి నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
అయితే, రఘురామపై దాడిని అడ్డుకున్న కూటమి నేతలపైనా దాడి జరిగినట్లు తెలుస్తోంది. రాడ్లతో ఓ వర్గం నాయకులు దాడికి దిగడంతో పలువురు కూటమి నేతలు గాయపడ్డారు.
గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. ఘటన స్థలంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా, పోలీసులు భారీగా మోహరించారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.