BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

రాష్ట్రంలో మూడు రోజులు రిజిస్ట్రేషన్ సేవలు బంద్.. జూన్ 29 నుంచి యథావిధిగా సేవలు

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
26 Jun, 2026 - 01:22 PM
63 వీక్షణలు

అమరావతి | N Today News

రాష్ట్రంలోని స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన సేవలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉండవని అధికారులు వెల్లడించారు. శాఖ వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవల సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అధికారుల సమాచారం ప్రకారం, జూన్ 26 నుంచి జూన్ 28 వరకు శాఖకు సంబంధించిన సేవలు నిలిపివేయబడతాయి. ఈ కాలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, ఆన్‌లైన్ లావాదేవీలు, ఇతర డిజిటల్ సేవలు అందుబాటులో ఉండవు.

జూన్ 26న మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండగా, జూన్ 28 ఆదివారం సెలవు. మధ్యలో ఉండే జూన్ 27 (శనివారం) పనిదినమైనప్పటికీ, సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ముఖ్యంగా ఆన్‌లైన్ చెల్లింపుల సేవలు అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు.

సర్వర్ నిర్వహణ పనులు పూర్తైన అనంతరం జూన్ 29 నుంచి స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖ సేవలు యథావిధిగా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ అవసరాలు ఉన్న ప్రజలు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ పనులను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.